చేతకాని పాలనతో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.. జగన్ నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉన్నాయని.. అధికార పార్టీపై రాజకీయ యుద్ధం చేస్తామని అన్నారు.. ఏపీని అప్పుల ఊబిలోకి సీఎం నెట్టేస్తున్నారన్న తులసిరెడ్డి.. తిరుపతి ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని చెప్పారు. యువజన కాంగ్రెస్ రెండు రోజుల శిక్షణా తరగతులను తులసిరెడ్డి తిరుపతిలో ప్రారంభించారు.