జగన్‌ సర్కారు రుణమాఫీ చేయకుండా రూ.8వేల కోట్లు ఎగ్గొట్టింది : తులసిరెడ్డి

Update: 2020-12-10 13:49 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. నూతన వ్యవసాయ విధానాలతో రైతులకు ఆహార భద్రత ఉండదని అన్నారు. జగన్‌ సర్కారు రుణమాఫీ చేయకుండా 8వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు తగ్గించారని ధ్వజమెత్తారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే.. రైతులకు ఉరితాళ్లు బిగించినట్టేనని తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.


Tags:    

Similar News