ఆంధ్రప్రదేశ్ లో మరో సంచలనం నమోదైంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఒంగోలులో అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరుకు తరలించారు. ఈ కేసులో విజయ్ పాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు విజయ్ పాల్. అయితే ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణకు సహకరించకపోవడం వల్లే విజయ్ పాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.