విజయవాడలో అద్దెఇళ్ల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు

విజయవాడలో అద్దె ఇల్లు పేరుతో సరికొత్త మోసాలకు తెరతీశారు సైబర్ నేరగాళ్లు.

Update: 2021-04-10 07:34 GMT

విజయవాడలో అద్దె ఇల్లు పేరుతో సరికొత్త మోసాలకు తెరతీశారు సైబర్ నేరగాళ్లు. ఆర్మీ ఉద్యోగుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా అద్దె ఇళ్ల వివరాలు సేకరించి.. తర్వాత ఇళ్లు కావాలని వారిని మాయమాటలతో మభ్యపెట్టి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదును తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఒకరు.. 75వేల రూపాయలను పోగొట్టుకున్నాడు. దీంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News