VISHKA: విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్!

Update: 2025-07-25 06:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె. వామనరావు డైరెక్టర్‌గా ఉన్న బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వైజా‌గ్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతుందని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,250 కోట్లను కేటాయించనుంది. అయితే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు ప్రభుత్వం ఎంత భూమిని కేటాయించనుంది? ఎంత రేట్‌కు అనే విషయాలు ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.

ఈ కం­పె­నీ హై­ద­రా­బా­ద్‌­తో పాటు వై­జా­గ్‌­లో కూడా వర­ల్డ్ ట్రే­డ్ సెం­ట­ర్స్‌­ను డె­వ­ల­ప్ చే­య­బో­తు­న్న­ట్లు మూ­డే­ళ్ల క్రి­త­మే ప్ర­క­టిం­చిం­ది. దే­శం­లో­నే అతి పె­ద్ద వర­ల్డ్ ట్రే­డ్ సెం­ట­ర్ ప్రా­జె­క్ట్‌­ను 60 ఎక­రా­ల్లో శం­షా­బా­ద్‌­లో అభి­వృ­ద్ధి చే­య­ను­న్న­ట్లు తె­లి­పింద. వై­జా­గ్‌­లో రు­షి­కొండ హి­ల్స్‌­పై వర­ల్డ్ ట్రే­డ్ సెం­ట­ర్ కోసం ప్లా­న్ చే­స్తు­న్న­ట్లు గతం­లో తె­లి­పా­రు. అయి­తే ఇప్పు­డు ప్ర­భు­త్వం మా­త్రం ఎం­డా­డ­లో ఈ ప్రా­జె­క్ట్ రా­ను­న్న­ట్లు వె­ల్ల­డిం­చిం­ది. వర­ల్డ్ ట్రే­డ్ సెం­ట­ర్ 15వేల మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు వస్తా­య­ని తె­లి­పా­రు. వి­శా­ఖ­ప­ట్నం­లో సిఫీ ఇన్ఫి­ని­ట్ట స్పే­సె­స్ లి­మి­టె­డ్ ఏర్పా­టు చే­య­ను­న్నా­రు.

Tags:    

Similar News