తిరుమల పర్యటన రద్దు సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతోంది విశ్వహిందూ పరిషత్. దేశంలోని దళితులను హిందూ మతం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు తెలంగాణ VHP నేత బాలస్వామి. వారిని క్రైస్తవులుగా మార్చే వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. జగన్ లాంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాలు చేస్తున్నది జగన్, వైసీపీ నేతలే అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు వీహెచ్ పీ నేతలు.