VIVEKA: అవినాష్ బెయిల్ రద్దు చేయండి
వివేకా హత్య కేసు నిందితులు తిమింగలాల వంటి వారన్న సునీత తరపు న్యాయవాది... తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు;
వివేకా హత్య కేసు నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగల తిమింగలాల వంటివారని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి బయట ఉంటే... విచారణ పారదర్శకంగా జరగదని... తెలిపారు. అందుకే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసులో అప్రూవర్గా మారిన తనకు అవినాష్రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని దస్తగిరి కోర్టుకు నివేదించారు. జగనన్న పైనే పోటీ చేస్తావా ? అంటూ బెదిరిస్తున్నారన్నారు.
పోలీసులు, జైలు అధికారులతో సహా వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉందని..... తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారని తెలిపారు. అవినాష్రెడ్డికి అనుకూలంగా చెప్పాలని బెదిరిస్తున్నారన్నారని తెలిపారు. అంతకుముందు సీబీఐ తరఫున న్యాయవాది అనిల్ తల్వార్ వాదనలు వినిపించారు. దస్తగిరిని పోలీసులు రకరకాలుగా బెదిరించారని కోర్టుకు నివేదించారు. శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఏకంగా జైలుకు వచ్చి 20 కోట్లు ఆఫర్ చేశారని, అంగీకరించకపోవడంతో జైలు కాబట్టి బతికిపోయావ్ లేదంటే నరికేసేవాడినని. బెదిరించారని తెలిపారు. కేసులో నిష్పాక్షికంగా విచారణ కొనసాగాలంటే అవినాష్రెడ్డి బెయిలు రద్దు చేయాల్సిందేనని సునీత తరఫు సీనియర్ న్యాయవాది బి.నళిన్కుమార్ కోరారు. ఈ కేసులో దస్తగిరి, ఆయన భార్య చేసిన ఫిర్యాదులే దీనికి నిదర్శనమన్నారు. కస్టడీలో ఉన్న దస్తగిరిని మార్గమధ్యంలో కొట్టి బెదిరించారని పేర్కొన్నారు.
వైసీపీ కౌన్సిలర్ రాజశేఖరరెడ్డితోపాటు భాను తదితరులు ఆయన భార్యను బెదిరించారని ఆయన తండ్రిపై దాడులు చేశారని తెలిపారు. జైలులో 14 రోజులపాటు లాకప్లోనే ఉంచి వేధించారని ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో బయటకు తీసుకువచ్చినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారన్నారన్నారు. జైలులో చైతన్యరెడ్డి 20 కోట్లు ఆఫర్ చేశారనే విషయాన్ని దస్తగిరి... ఆయన భార్యకు చెప్పగా దానిపై ఆమె సీబీఐకి ఫిర్యాదు చేశారని వివరించారు. దీంతో జైలు అధికారులు దస్తగిరిని బెదిరించి మతిస్థిమితం లేక భార్య అలా చెప్పిందంటూ ప్రకటన ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారని... పేర్కొన్నారు. అవినాష్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వివేకా హత్యకు ఆయుధాన్ని తీసుకువచ్చి హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తికి బాధితులైన సునీత, సీబీఐ వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చైతన్యరెడ్డి జైలులో కలిసి 20 కోట్లు ఇస్తారన్నారని చెప్పారని జైలు సీసీ కెమెరాలుంటాయని, చుట్టూ డాక్టర్లు, అధికారులు ఉండగా ఇదెలా సాధ్యమని వాదనలు వినిపించారు. దస్తగిరి తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారని, ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్న ఫిర్యాదులో అవినాష్రెడ్డి పేరు లేదని తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించినందున జరిమానా విధించాల్సి ఉందని తెలిపారు.
ఈ వాదనతో దస్తగిరి తరఫు న్యాయవాది జడ శ్రావణ్కుమార్ విభేదిస్తూ....... పిటిషనర్కు వ్యతిరేకంగా తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. పదేపదే తప్పుడు కేసులు బనాయిస్తూనే ఉన్నారన్నారు. కుటుంబానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారని ఆదివారం కూడా బెదిరింపులు వచ్చాయని వివరించారు. జైలులో సీసీ కెమెరాలు ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారని ఆరోపించారు. అవినాష్రెడ్డి బెయిలును రద్దుచేయాలంటూ మార్చి 11న ఇక్కడ పిటిషన్ దాఖలు చేశానని అయితే చైతన్యరెడ్డి మార్చి 2న జైలు అధికారుల నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకున్నారని వెల్లడించారు. లేదంటే పాత తేదీతో తీసుకున్నారేమో తెలియదని చెప్పారు. దస్తగిరి తండ్రి.. దాడికి గురై గాయపడి చికిత్సకు వెళితే డాక్టరు వాహనం మీది నుంచి పడినట్లు చెబుతున్నారన్నారు. జగన్ అధికారాన్ని అండ చూసుకుని అవినాష్రెడ్డి పోలీసులతో కలిసి సాక్షులను బెదిరిస్తున్నారన్నారని వాదనలు వినిపించారు. నిందితులు తిమింగలాల వంటివారని వారు ఎవరినైనా ప్రభావితం చేయగలరని, సాక్షులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నందున బెయిలు రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి......... తీర్పును వాయిదా వేశారు.