ఏపీలో విషాదం.. రహదారి లేక గిరిజన బాలింత మృతి

Update: 2020-09-12 03:45 GMT

ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నా.. వెళ్లడానికి రహదారి లేక ప్రాణాలపైకి తెచ్చుకున్న బాలింత.. మూడు నెలల పసిపాపకు.. మూడేళ్ల బాలుడికి దూరమైన తల్లి.. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు.. రహదారి లేకపోవడంతోనే వసంతి మృతి చెందిందని ఆవేదన. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే నేతలు తరువాత పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి గ్రామస్థులు విమర్శించారు.. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

Tags:    

Similar News