YCP: ఏపీకి పెట్టుబడులు రాకుండా.. వైసీపీ కుట్రలు

వైసీపీ కుట్రలపై విచారణ చేయిస్తాం.. జగన్ కుట్రలను తిప్పకొట్టాలన్న సీఎం;

Update: 2025-07-10 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డు­లు రా­కుం­డా వై­సీ­పీ అడ్డు­కో­వ­డం­పై ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. వై­సీ­పీ కు­ట్ర­ల­పై వి­చా­రణ చే­యి­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. చే­సిన తప్పు­ల­ను ప్ర­త్య­ర్థు­ల­పై­కి నె­ట్టే­సే కు­ట్ర­ల­ను వై­సీ­పీ ఇంకా అమలు చే­స్తుం­ద­ని.. ని­ధు­లు రా­కుం­డా తె­ర­వె­నుక అడ్డు­కో­వ­డం వా­రి­కి అల­వా­టు­గా మా­రిం­ద­ని ఆరో­పిం­చా­రు. పథ­కా­లు ఇవ్వ­డం లే­దం­టూ వై­సీ­పీ నే­త­లు దు­ష్ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఇం­డో­సో­ల్​­కి భూ­ము­లు ఇవ్వొ­ద్ద­ని రై­తు­ల్ని రె­చ్చ­గొ­ట్టిం­చిం­ది జగ­నే­న­ని ఆక్షే­పిం­చా­రు. మరో­వై­పు ఆయన పరి­శ్ర­మ­లు తర­లి­పో­తు­న్నా­య్ అంటూ సొంత మీ­డి­యా­లో రా­యి­స్తు­న్న­ట్లు మం­డి­ప­డ్డా­రు. జగన్ కు­ట్ర­ల్ని ఎక్క­డి­క­క్కడ సమ­ర్థం­గా తి­ప్పి­కొ­ట్టా­ల­ని సీఎం మం­త్రు­ల­కు సూ­చిం­చా­రు.

200 కంపెనీలకు వైసీపీ ఈ మెయిల్‌

ఏపీ ప్ర­భు­త్వ బ్రాం­డ్‌ ఇమే­జ్‌ దె­బ్బ­తీ­సే­లా వి­విధ సం­స్థ­ల­కు మె­యి­ళ్లు పె­ట్ట­డా­న్ని సీఎం చం­ద్ర­బా­బు తీ­వ్రం­గా పరి­గ­ణిం­చా­రు. పె­ట్టు­బ­డు­ల­ను అడ్డు­కు­నేం­దు­కు వై­సీ­పీ చే­స్తు­న్న కు­ట్ర­ల­ను మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో ఆర్థిక మం­త్రి పయ్యా­వుల కే­శ­వ్‌ ప్ర­స్తా­విం­చా­రు. ఏపీ­ఎం­డీ­సీ బాం­డ్ల­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టొ­ద్ద­ని 200 కం­పె­నీ­ల­కు ఈ-మె­యి­ళ్లు పె­ట్టా­ర­ని తె­లి­పా­రు. వై­సీ­పీ కు­ట్ర­ల­పై వి­చా­ర­ణ­కు ఆదే­శి­స్తా­మ­ని మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో సీఎం చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. రై­తుల సం­దే­హా­ల­ను ని­వృ­త్తి చేసి.. వారు ఒప్పు­కు­న్నా­కే భూ సమీ­క­రణ చే­యా­ల­ని తమకు సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­ర­ని తె­లి­పా­రు. రా­ష్ట్రం అభి­వృ­ద్ది చెం­ద­కుం­డా ప్ర­తి­ప­క్షం చే­స్తో­న్న కు­ట్ర­లు తి­ప్పి కొ­ట్టా­ల్సిన బా­ధ్యత మం­త్రు­ల­పై ఉం­ద­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. ఈ కు­ట్ర­ల­ను సమ­ర్థ­వం­తం­గా తి­ప్పి కొ­ట్టా­ల­ని ఈ కే­బి­నె­ట్ సమా­వే­శం­లో సీఎం చం­ద్ర­బా­బు తమకు స్ప­ష్టం­గా ఆదే­శిం­చా­ర­ని మం­త్రి కొ­లు­సు పా­ర్థ­సా­ర­థి సమా­వే­శం ము­గి­సిన అనం­త­రం వి­వ­రిం­చా­రు. వై­సీ­పీ­కి చెం­దిన సీ­ని­య­ర్ నా­య­కు­లు కూడా ప్రె­స్ మీట్ లు పె­ట్టి ప్ర­భు­త్వం­పై వ్య­తి­రేక ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని దీం­తో పె­ట్టు­బ­డు­లు పె­ట్టే­వా­రు రా­కుం­డా చూ­డా­ల­న్న­దే వారి ప్ర­ధాన ఉద్దే­శం గా ఉం­ద­ని మం­త్రి చె­ప్పు­కొ­చ్చా­రు. 200 ఈ-మె­యి­ళ్ల­‌­కు సం­బం­ధిం­చిన సమా­చా­రా­న్ని ఆయన మీ­డి­యా ముం­దు ప్ర­ద­ర్శిం­చా­రు. ఇటు­వం­టి అస­త్య ప్ర­చా­రా­ల­ను మా­ను­కో­వా­ల­ని రా­ష్ట్ర అభి­వృ­ద్ధి చెం­దేం­దు­కు కు­ది­రి­తే కలి­సి పని చే­యా­ల­ని లే­క­పో­తే మౌ­నం­గా ఉం­డా­ల­ని సీ­రి­య­స్ గా వ్యా­ఖ్యా­నిం­చా­రు.

మంత్రివర్గం కీలక నిర్ణయాలు

అమ­రా­వ­తి­లో ని­ర్మా­ణం­లో ఉన్న ప్ర­జా ప్ర­తి­ని­ధు­లు, అధి­కా­రుల భవ­నా­ల­ను సత్వ­రం పూ­ర్తి చే­యా­ల­ని ఏపీ మం­త్రి­వ­ర్గం తీ­ర్మా­నిం­చి­న­ట్లు కే­బి­నె­ట్ భేటీ ము­గి­సిన అనం­త­రం కొ­లు­సు పా­ర్థ­సా­ర­ధి వె­ల్ల­డిం­చా­రు. మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, ఐఏ­ఎ­స్‌ల ని­వాస భవ­నా­లు పూ­ర్తి చే­య­డం కోసం ని­ధుల మం­జూ­రు­కు సైతం ఈ కే­బి­నె­ట్‌­లో ఆమో­దం తె­లి­పి­న­ట్లు చె­ప్పా­రు. భవ­నా­లు మి­గి­లిన పనుల పూ­ర్తి చే­సేం­దు­కు రూ. 524.7 కో­ట్లు ని­ధుల మం­జూ­రు­కు పరి­పా­లన పర­మైన ఆమో­దం చె­ప్పి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. అమ­రా­వ­తి­లో 6 కేం­ద్ర ప్ర­భు­త్వ సం­స్థ­ల­కు 33.49 ఎక­రా­లు భూ­ము­లు కే­టా­యిం­పు­న­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చా­మ­న్నా­రు. అమ­రా­వ­తి­లో కొ­త్త­గా 7 సం­స్థ­ల­కు 32. 4 ఎక­రా­లు భూమి కే­టా­యి­స్తూ ఆమో­దం తె­లి­పా­మ­ని పే­ర్కొ­న్నా­రు. అలా­గే గె­యి­ల్, అం­బి­కా సం­స్థ­ల­కు అమ­రా­వ­తి­లో కే­టా­యిం­చిన భూ­మి­ని రద్దు ప్ర­తి­పా­ద­న­కు ఆమో­దం తె­లి­పా­మ­న్నా­రు. ఇక కృ­ష్ణా­న­దీ­లో ప్ర­కా­శం బ్యా­రే­జీ ముం­దు ఇసుక క్వా­రీ­యిం­గ్ కోసం రూ. 250.2 కో­ట్లు పరి­పా­లన పరం­గా ఆమో­దిం­చా­మ­ని చె­ప్పా­రు. ఎన్జీ­టీ, సు­ప్రీం­కో­ర్టు ఆదే­శా­ల­కు లో­బ­డి క్వా­రీ­యిం­గ్‌­ను ఏపీ సీ­ఆ­ర్డీఏ ని­ర్వ­హ­ణ­కు కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ద­ని వి­వ­రిం­చా­రు. జల వన­రుల శా­ఖ­లో గత ప్ర­భు­త్వం పక్కన పె­ట్టిన 71 పను­ల­ను పూ­ర్తి చే­సేం­దు­కు ప్ర­తి­పా­ద­న­ల­ను కే­బి­నె­ట్ ఆమో­దిం­చిం­ద­న్నా­రు. కు­ప్పం, దగ­ద­ర్తి, శ్రీ­కా­కు­ళం­లో వి­మా­నా­శ్ర­యాల అభి­వృ­ద్ది­కి రూ. 1000 కో­ట్లు హడ్కో నుం­చి రుణం తీ­సు­కు­నేం­దు­కు ఆమో­దం తె­లి­పా­మ­న్నా­రు. ఎయి­ర్‌­పో­ర్టు­లు లీ­జు­కు ఇవ్వ­డం.. పీ­పీ­పీ ద్వా­రా వచ్చిన ఆదా­యం­తో ఈ అప్పు­లు చె­ల్లిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­మ­ని చె­ప్పా­రు. రా­మా­య­ప­ట్నం­లో భూ సే­క­రణ కోసం ఐదు టీ­మ్‌­ల­ను ఏర్పా­టు చేసే ప్ర­తి­పా­ద­న­కు ఆమో­దం తె­లి­పి­న­ట్లు చె­ప్పా­రు. రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో వై­సీ­పీ ప్ర­భు­త్వం రద్దు చే­సిన 1,575 పిం­ఛ­న్ల­ను పు­న­రు­ద్ద­రిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­మ­న్నా­రు. మా­ర్క్‌­ఫె­డ్ తీ­సు­కు­న్న­రూ. 6, 700 కో­ట్లు రు­ణా­ని­కి అద­నం­గా రూ. 1000 కో­ట్లు రుణం పొం­దేం­దు­కు ఆమో­దం తె­లి­పి­న­ట్లు చె­ప్పా­రు. 6.5 లక్షల మె­ట్రి­క్ టన్నుల తో­తా­పు­రి మా­మి­డి­ని కొ­ను­గో­లు చే­సేం­దు­కు మం­త్రి వర్గం ఆమో­దం తె­లి­పిం­ద­ని చె­ప్పా­రు. రై­తు­ల­కు ధా­న్యం సే­క­రణ నగదు చె­ల్లిం­చేం­దు­కు రూ. 672 కో­ట్లు వి­డు­ద­ల­కు ఆమో­దం తె­లి­పా­మ­న్నా­రు. రై­తుల ఖా­తా­లో ధా­న్యం కొ­ను­గో­లు నగదు జమ చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ద­ని చె­ప్పా­రు. అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ కం­ప్యూ­టిం­గ్ సెం­ట­ర్‌ ఏర్పా­టు చేసే ప్ర­తి­పా­ద­న­కు మం­త్రి మం­డ­లి ఆమోద ము­ద్ర వే­సిం­ద­ని చె­ప్పా­రు. రా­ష్ట్రం­లో స్పే­స్ టె­క్నా­ల­జీ అభి­వృ­ద్ది కోసం ప్ర­క­టిం­చిన పా­ల­సీ­కి పచ్చ జెం­డా ఊపి­న­ట్లు తె­లి­పా­రు

Tags:    

Similar News