AP: సాగర తీరాన... నమో యోగాంధ్ర

గిన్నీస్‌ బుక్‌లో స్థానం... 3 లక్షలమందితో కలిసి మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ యోగాసనాలు;

Update: 2025-06-22 01:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా చే­ప­ట్టిన ‘యో­గాం­ధ్ర-2025’ కా­ర్య­క్ర­మం సరి­కొ­త్త ప్ర­పంచ రి­కా­ర్డు­ను నె­ల­కొ­ల్పిం­ది. 11వ అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని వి­శా­ఖ­ప­ట్నం వే­ది­క­గా ని­ర్వ­హిం­చిన ఈ బృ­హ­త్ యోగా ప్ర­ద­ర్శన గి­న్ని­స్ బుక్ ఆఫ్ వర­ల్డ్ రి­కా­ర్డ్స్‌­లో స్థా­నం దక్కిం­చు­కుం­ది. ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ ము­ఖ్యఅ­తి­థి­గా పా­ల్గొ­న­డం­తో ఈ కా­ర్య­క్ర­మం ప్ర­తి­ష్ట మరింత పె­రి­గిం­ది. పదే­ళ్లు­గా ప్ర­పంచ ప్ర­జ­లం­ద­రూ జరు­పు­కుం­టు­న్న అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వా­న్ని 11వ ఏడా­ది కా­ర్య­క్ర­మం ఈసా­రి ఏపీ­కి ప్ర­తి­ష్టా­త్మ­క­మైం­ది. ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ మా­ర్గ ని­ర్దే­శం­లో... ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నే­తృ­త్వం­లో ఈ కా­ర్య­క్ర­మం జరి­గిం­ది. పీఎం మోదీ, ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్... యోగా ది­నో­త్స­వం­లో పా­ల్గొ­ని యో­గ­స­నా­లు వే­శా­రు. ఈ అపూ­ర్వ కా­ర్య­క్ర­మం­లో మూడు లక్ష­ల­కు పైగా యోగ సా­ధ­కు­లు ఉత్సా­హం­గా పా­ల్గొ­ని వి­జ­య­వం­తం చే­శా­రు. వి­శాఖ నగ­రం­లో­ని సుం­ద­ర­మైన రా­మ­కృ­ష్ణ బీచ్ నుం­చి భీ­మి­లి వరకు వి­స్త­రిం­చిన సు­దీ­ర్ఘ మా­ర్గం­లో లక్ష­లా­ది మంది యోగా సా­ధ­కు­లు ఏక­కా­లం­లో వి­విధ యో­గా­స­నా­లు వే­శా­రు. క్ర­మ­శి­క్ష­ణ­తో, సమ­న్వ­యం­తో సా­గిన ఈ యోగా ప్ర­ద­ర్శన చూ­ప­రు­ల­ను అబ్బు­ర­ప­రి­చిం­ది. ఇంత పె­ద్ద సం­ఖ్య­లో ప్ర­జ­లు ఒకే చోట, ఒకే సమ­యం­లో యోగా చే­య­డం ద్వా­రా గతం­లో గు­జ­రా­త్‌­లో­ని సూ­ర­త్‌­లో నమో­దైన రి­కా­ర్డు­ను ‘యో­గాం­ధ్ర-2025’ అధి­గ­మిం­చ­డం వి­శే­షం. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.


అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా ప్ర­పంచ వ్యా­ప్తం­గా యోగా వే­డు­క­లు ఘనం­గా ని­ర్వ­హిం­చా­రు. 2025 అం­త­ర్జా­తీయ యోగా ది­నో­త్స­వం థీమ్ ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హె­ల్త్’’. ఈ థీ­మ్‌­ను భారత ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోడీ 2025 మా­ర్చి 30వ తే­దీన మన్ కీ బాత్ రే­డి­యో కా­ర్య­క్ర­మం­లో ప్ర­క­టిం­చా­రు. ప్ర­ధా­ని మోదీ పా­ల్గొం­టు­న్న కా­ర్య­క్ర­మం కా­వ­డం­తో ఏపీ ప్ర­భు­త్వ యం­త్రాం­గం, యోగా శి­క్ష­కు­లు ఆర్‌­కే బీ­చ్‌ నుం­చి భీ­మి­లి వరకు బీ­చ్‌ రో­డ్డు­తో­పా­టు మరి­కొ­న్ని ప్ర­దే­శా­ల్లో యో­గా­స­నా­లు వే­స్తు­న్నా­రు. ఇం­ట­ర్నే­ష­న­ల్ యోగా డే సం­ద­ర్భం­గా వి­శా­ఖ­లో పండగ వా­తా­వ­ర­ణం కని­పి­స్తోం­ది. సాగర తీ­రం­లో యో­గా­కు సం­బం­ధిం­చిన ట్ర­యల రన్‌ పూ­ర్తి చే­సిన అధి­కా­రు­లు యోగా ది­నో­త్స­వా­న్ని వి­జ­య­వ­తం­గా ని­ర్వ­హిం­చా­రు. 326 కం­పా­ర్ట్‌­మెం­ట్‌­లు ఏర్పా­టు చేసి ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు, అధి­కా­రు­లు, ప్ర­జ­లు, యోగా శి­క్ష­కు­లు కలి­సి దా­దా­పు ఐదు లక్షల మంది ఆస­నా­లు వే­శారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు. ఒకేసారి మూడు లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు.

Tags:    

Similar News