AP: సాగర తీరాన... నమో యోగాంధ్ర
గిన్నీస్ బుక్లో స్థానం... 3 లక్షలమందితో కలిసి మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్ యోగాసనాలు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్గ నిర్దేశంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్... యోగా దినోత్సవంలో పాల్గొని యోగసనాలు వేశారు. ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా యోగ సాధకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది యోగా సాధకులు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్లోని సూరత్లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర-2025’ అధిగమించడం విశేషం. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’’. ఈ థీమ్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 మార్చి 30వ తేదీన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రకటించారు. ప్రధాని మోదీ పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, యోగా శిక్షకులు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డుతోపాటు మరికొన్ని ప్రదేశాల్లో యోగాసనాలు వేస్తున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖలో పండగ వాతావరణం కనిపిస్తోంది. సాగర తీరంలో యోగాకు సంబంధించిన ట్రయల రన్ పూర్తి చేసిన అధికారులు యోగా దినోత్సవాన్ని విజయవతంగా నిర్వహించారు. 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, యోగా శిక్షకులు కలిసి దాదాపు ఐదు లక్షల మంది ఆసనాలు వేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు. ఒకేసారి మూడు లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు.