కడప జిల్లా మల్లెలలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మల్లెల ఘాట్ వద్ద కారులో మంటలు వ్యాపించి.. యువకుడు అహ్మద్ సజీవ దహనం అయ్యాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో మంటలు వ్యాపించి ప్రమాదవశాత్తు అహ్మద్ చనిపోయాడా లేక.. ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొద్దుటూరు ఆటోనగర్లో మెకానిక్గా పని చేసే అహ్మద్ మృతితో స్థానికులు ఉలిక్కిపడ్డారు.