YS Jagan: టికెట్ రేట్ల తగ్గింపును విమర్శించే వాళ్లంతా పేదలకు శత్రువులే: జగన్

YS Jagan: సినిమా టికెట్ల ధరల తగ్గింపును విమర్శించే వాళ్లంతా పేదలకు శత్రువులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.

Update: 2022-01-01 12:09 GMT

YS Jagan:సినిమా టికెట్ల ధరల తగ్గింపును విమర్శించే వాళ్లంతా పేదలకు శత్రువులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. సినిమా టికెట్ల ధరలను తగ్గించినందుకు సినీ పరిశ్రమలోని కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేదలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ధరలు తగ్గిస్తే.. ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.

జగన్‌ వ్యాఖ్యలపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. పేదలకు మంచి చేయడం అంటే సినిమా టికెట్ల ధరలు తగ్గించడం కాదని డైరెక్టుగానే విమర్శిస్తున్నారు. పేదలకు మంచి చేయడం అంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం అని గుర్తుచేస్తున్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు తగ్గిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా కూడా తగ్గించలేదని, ఈ విషయంలో జగన్‌కు పేదలు గుర్తు రావడం లేదా అని విమర్శిస్తున్నారు.

పేదలకు మంచి చేయడం అంటే కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు తగ్గించడం అని బహిరంగంగానే ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు. నిత్యావసర సరుకులు ధరలు, పెట్రోల్, గ్యాస్‌ ధరలు తగ్గిస్తే పేదలకు ఉపశమనం ఉంటుంది తప్ప.. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి పేదలకు మంచి చేస్తున్నామని అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News