లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ 68వ రోజుకు చేరింది. ఇవాళ తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. కాసేపట్లో పసలూరూ క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం.. కొట్టాలపల్లి క్రాస్ వద్ద మిర్చి రైతులతో లోకేష్ సమావేశమవుతారు. ఆ తర్వాత కమ్మవారిపల్లి వద్ద నిరుద్యోగ యువతతో భేటీ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం.. నగరారు వద్ద రైతులతో ముచ్చటిస్తారు. తుట్రపల్లిలో భోజన విరామం తీసుకుంటారు.
భోజన విరామం తర్వాత తుట్రపల్లి నుంచి లోకేషన్ తన పాదయాత్రను కొనసాగిస్తారు. తుట్రపల్లి ఎస్సీ కాలనీలో వృద్ధులతో సమావేశమవుతారు. తర్వాత తుట్రపల్లి పట్టు రైతులతో భేటీ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. టి.కొత్తపల్లిలో అరటిరైతులతో సమావేశమవుతారు. రామరాజుపల్లిలో ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. కూర్మాజీపేటలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రాయలచెరువు ఎస్సీ కాలనీలో స్థానికులతో సమావేశమవుతారు. ఆ తర్వాత రాయలచెరువులో జరిగే బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాయలచెరువు సమీపంలోని విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.