Athiya-KL Rahul: కానుకల వర్షం... పచ్చి అబద్ధం...

ఆతియా-రాహుల్ కు సెలబ్రిటీల నుంచి ఖరీదైన బహుమతులు; ఆ వర్తల్లో నిజం లేదంటోన్న సునీల్ శెట్టి.....

Update: 2023-01-27 11:10 GMT

అంగరంగ వైభవంగా ఒక్కటైన ఆతియా-రాహుల్ జంటపై ఇటు ఇండస్ట్రీ నుంచి అటు క్రికెటర్ల నుంచి భారీగా కానుకల వర్షం కురుస్తోందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గిఫ్ట్ అంటే ఏ ఫోటో ఫ్రేములో, కాఫీ కప్పుల సెట్లో అనుకునేరు... ఈ అందాల జంటకు ఫ్యాన్సీ అపార్ట్మెంట్లు, కోట్ల విలువ చేసే కార్లు బహుమతులుగా వస్తున్నాయట. 


సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, విరాట్ కోహ్లీ, ధోని ఆతియా-రాహుల్ కు ఖరీదైన గిప్ట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆతియా తండ్రి సునీల్ శెట్టి ఆమె కోసం ముంబైలో 50కోట్లు విలువ చేసే బంగ్లాను బహుమతిగా ఇచ్చాడని టాక్. ఇక ఆతియాను హీరోయిన్ గా లాంచ్ చేసిన సల్మాన్ ఖాన్ ఆమెకు రూ. కోటీ 64లక్షలు పెట్టి ఆడి కారు కొన్నాడట. జాకీ ష్రాఫ్ రూ.30లక్షలు పెట్టి ఛోపార్డ్ వాచ్ లు బహూకరించాడట. అర్జున్ కపూర్ కోటిన్నర పెట్టి డైమండ్ బ్రేస్లెట్ చేయించేశాడట. ఇక రాహుల్ కు రూ. 2 కోట్లు ఖరీదైన  బీఎండబ్యూ కారును బహూకరించాడట విరాఠ్  కోహ్లీ.  ధోనీ రూ. 8 లక్షలతో కవాసాకీ నింజా బైక్ ను గిఫ్ట్ చేశాడట. ఇలా సామాన్యుడికి కళ్లు బైర్లు కమ్మే రేంజ్ లో కొత్త జంటపై కానుకల వర్షం కురిసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


అయితే ఈ వార్తల్లో ఏమాత్రమ నిజం లేదని సునీల్ శెట్టి తేల్చేశాడు. తమ పిల్లలకు ఎలాంటి గిఫ్ట్ లూ రాలేదని, తానూ ఎవరికీ ఏమీ ఇవ్వలేదని అధికారిక ప్రకటన విడుదల చేశాడు. 

Tags:    

Similar News