Akshay Kumar: అక్షయ్ కుమార్కు కరోనా పాజిటివ్..!
దేశంలో కరోన సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.;
దేశంలో కరోన సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న ఆలియా భట్కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి,వైద్యపరీక్షలు చేయించుకున్నట్లు తెలిపాడు. ఇటీవల తనని కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. వెంటనే తిరిగి వచ్చేస్తా అని చెప్పాడు. కాగా అక్షయ్ కుమార్ గత కొద్ది రోజులుగా రామసేతు షూటింగ్ లో పాల్గొంటున్నాడు.