Karan Johar: బాలీవుడ్‌లో మళ్లీ కరోనా కలకలం.. కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిన 55 మందికి పాజిటివ్..?

Karan Johar: బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో పాటు స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కరోనా భారిన పడ్డారు.

Update: 2022-06-05 11:30 GMT

Karan Johar: బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలలం మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో పాటు స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కరోనా భారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో వీరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల బాలీవుడ్ ద‌ర్శక‌,నిర్మాత క‌రణ్ జోహార్ బ‌ర్త్ డే పార్టీ గ్రాండ్ గా జ‌రిగింది. ఈ పార్టీకి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోని ప‌లువురు సెల‌బ్రిటీలు ఉన్నారు. ఈ పార్టీకి వెళ్లిన వారిలో 55మందికి క‌రోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. షారుక్, కత్రినాకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు

Tags:    

Similar News