చిన్న కోడలికి చిరు కానుక.. దుబాయ్‌లో రూ.640 కోట్ల విల్లా

భారతదేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తన పిల్లలైన ఆకాష్, ఇషా, అనంత్‌లను విలాసవంతం చేయడానికి వనరులు కలిగి ఉన్నారు.;

Update: 2024-05-25 11:45 GMT

భారతదేశంలో అత్యంత సంపన్నుడు మరియు ప్రపంచంలోని పదవ అత్యంత ధనవంతుడు, ముఖేష్ అంబానీ తమ చిన్న కుమారుడి పెళ్లి సన్నాహాల్లో ఉన్నారు. మొదటి ప్రీ వెడ్డుకలను జామ్ నగర్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం దాదాపు INR 1259 కోట్లు ఖర్చు చేశారు. సూపర్ స్టార్ రిహన్నాకు INR 74 కోట్ల మధ్య చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జులైలో నిర్వహించే పెళ్లికి అంతకు రెండింతలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అనంత్, రాధికలకు ముఖేష్ అంబానీ పెళ్లి కానుక



తన కుమారుడు అనంత్ కోసం, ముఖేష్ అంబానీ దుబాయ్‌లో బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. నివేదికల ప్రకారం, ఈ పామ్ జుమేరా ఇల్లు దుబాయ్‌లో అత్యంత ఖరీదైనది.

ఏప్రిల్ 2022లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బెడ్‌రూమ్‌లు మరియు 70 మీటర్ల ప్రైవేట్ బీచ్‌తో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సంపన్నమైన భవనం ధర 640 కోట్ల రూపాయలు. దుబాయ్‌లో ఇది రెండవ అతిపెద్ద రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్.

ప్రత్యేకమైన కళాకృతితో, ఇటాలియన్ మార్బుల్స్ తో విల్లా లోపలి భాగాన్ని అలంకరించారు. ఈ ఇల్లు ప్రైవేట్ బీచ్‌తో సహా బిలియనీర్ల కుటుంబం కోరుకునే ప్రతి విలాసవంతమైన సౌకర్యాన్ని కలిగి ఉంది. 

Tags:    

Similar News