AI: భారత్లో ఏఐ విప్లవం... రెండేళ్లలో నిపుణుల సంఖ్య రెట్టింపు
భారతదేశంలో AI టెక్నాలజీ.. 2027 నాటికి 12.5 లక్షలకు పెరిగే అవకాశం;
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ విస్తృతంగా విస్తరిస్తోంది. వ్యాపార రంగాల నుంచి స్టార్ట్అప్స్ వరకు అన్నిరంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తాజా నివేదిక ప్రకారం, భారత్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల మంది ఏఐ నిపుణుల సంఖ్య 2027 నాటికి 12.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద ఏఐ నిపుణుల సముదాయాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ నిపుణుల్లో 16 శాతం మంది భారత్లోనే ఉన్నారు. ఆధార్, యూపీఐ, ఓఎన్డీసీ వంటివి వ్యాపార సంస్థలకు డిజిటల్ ప్రాతిపదికపై ఏఐ విస్తరణకు బలమైన వేదికగా మారనున్నాయి. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య: 70 కోట్ల మందికి పైగా ఉన్నారు, ఇది పెద్ద మార్కెట్ గా మారింది.
ఏఐతో దూసుకెళ్తున్న సంస్థలు
భారతదేశంలోని పలు కంపెనీలు ఏఐ ఆధారిత టెక్నాలజీని తమ సేవల్లో విస్తృతంగా వినియోగిస్తూ, వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
రోజర్పే: వ్యాపారుల ఆన్బోర్డింగ్ను ఏఐ సులభతరం చేస్తోంది. కస్టమర్ సపోర్ట్లో 80% పని ఏఐతోనే.
లెన్స్కార్ట్: ఏఐ ఆధారిత ట్రై-ఆన్, ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీతో వినియోగదారులకు వినూత్న అనుభవం.
బీసీజీ అంచనా ప్రకారం, భారత్లో ఏఐ సేవల మార్కెట్ 2027 నాటికి $17 బిలియన్ కి చేరుతుంది. ప్రస్తుతం ఉన్న 152 డేటా సెంటర్లకు అదనంగా ఈ ఏడాది మరో 45 డేటా సెంటర్లు ఏర్పాటుకాబోతున్నాయి.