Ather Rizta Electric Scooter : లక్ష మార్క్ దాటిన ఏథర్ రిజ్జా

Update: 2025-06-04 10:00 GMT

ప్రముఖ టూ వీలర్ ఈవీ కంపెనీ ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్జా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని అధిగమించింది. గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన రిజా ఈవీ స్కూటర్ మొత్తం ఏథర్ అమ్మకాల్లో 60 శాతం వాటాను నమోదు చేసిందని కంపెనీ తెలిపింది. రిజ్జా స్కూటర్ విడుదలైన సంవత్సరంలోనే లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని తెలిపింది. 2024 ఏప్రిల్లో ఈ స్కూటర్ను ఏథర్ ఎనర్జీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఏథర్ నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీ స్కూటర్ అన్ని రాష్ట్రాల్లోనూ వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలిపింది. రైడ్ ను మరింత మెరుగుపర్చడానికి అనేక భద్రతా పరమైన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అండర్ సీట స్టోరేజీ 56 లీటర్లు ఉంటుందని, విశాలమైన సీటు దీని ప్రత్యేకతని తెలిపింది. ఈ స్కూటర్ కు యాంటీ స్కిడ్ కంట్రోల్ ప్రధాన ఆకర్షణ.

Tags:    

Similar News