INDIA: "భారత్ ఫ్యూచర్ సిటీ" ఇన్‌వెస్ట్‌మెంట్ హాట్ స్పాట్

రియల్ ఎస్టేట్ మళ్లీ చలనం!.. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ పైకి... పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య.. 2025లో రూ.3,381 కోట్ల దాటిన ప్రభుత్వ ఆదాయం

Update: 2025-10-27 07:30 GMT

గత రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్‌ ఎస్టేట్ రంగంలో మళ్లీ చలనం మొదలైంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వంటి కారణాలతో పాటు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల వల్ల భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల రిజిస్ట్రేషన్ల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం రియల్ రంగానికి కొంత ఊరటనిస్తోంది.

రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుదల

రి­జి­స్ట్రే­ష­న్స్‌ అం­డ్‌ స్టాం­ప్స్‌ వి­భా­గం అధి­కా­రుల గణాం­కాల ప్ర­కా­రం, భూ­ముల క్ర­య­వి­క్ర­యా­లు, తద్వా­రా ప్ర­భు­త్వా­ని­కి సమ­కూ­రే ఆదా­యం పె­రు­గు­తోం­ది. 2023 జన­వ­రి నుం­చి డి­సెం­బ­ర్ వరకు జి­ల్లా వ్యా­ప్తం­గా 2,48,189 డా­క్యు­మెం­ట్లు రి­జి­స్ట్రే­ష­న్ కాగా, వీటి ద్వా­రా ప్ర­భు­త్వా­ని­కి రూ.3,893.26 కో­ట్ల ఆదా­యం వచ్చిం­ది. 2024లో రి­జి­స్ట్రే­ష­న్లు స్వ­ల్పం­గా తగ్గి 2,41,297 డా­క్యు­మెం­ట్లు కాగా, ఆదా­యం మా­త్రం రూ.3,911.87 కో­ట్ల­కు పె­రి­గిం­ది. ఇక, 2025 జన­వ­రి నుం­చి అక్టో­బ­ర్ 20 వరకు (పది నె­ల­ల్లో) 1,98,766 డా­క్యు­మెం­ట్లు రి­జి­స్ట్రే­ష­న్ కాగా, అప్ప­టి­కే ప్ర­భు­త్వా­ని­కి రూ.3,381.12 కో­ట్ల ఆదా­యం సమ­కూ­రిం­ది. ఈ పె­రు­గు­దల రి­య­ల్టీ రంగం పుం­జు­కుం­టు­న్న­ద­నేం­దు­కు ని­ద­ర్శ­నం. ము­ఖ్యం­గా, గత ఏడా­ది­తో పో­లి­స్తే ఈ జూలై, ఆగ­స్టు, సె­ప్టెం­బ­ర్ నె­ల­ల్లో రి­జి­స్ట్రే­ష­న్ల సం­ఖ్య పె­ర­గ­డం మా­ర్కె­ట్ సెం­టి­మెం­ట్ మె­రు­గు­ప­డ­టా­న్ని సూ­చి­స్తుం­ది.

 రాయదుర్గం వేలం: రియల్టర్లలో కొత్త ఉత్సాహం

ఇటీవల హెచ్‌ఎండీఏ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలకడం (కొన్ని పార్శిళ్లకు రూ.200 కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని అంచనా) జిల్లాపై రియల్ సంస్థలు మళ్లీ దృష్టి సారించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా పెట్టుబడులకు వెనుకాడిన సంస్థలు, తాజా వేలంతో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

భారత్ ఫ్యూచర్ సిటీ’తో భారీ అంచనాలు

రా­య­దు­ర్గం వే­లం­తో పాటు, రా­ష్ట్ర ప్ర­భు­త్వం ప్ర­తి­ష్టా­త్మ­కం­గా చే­ప­ట్టిన 'భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సి­టీ' రి­య­ల్ రం­గా­ని­కి సు­వ­ర్ణా­వ­కా­శం­గా మా­రిం­ది. మీ­ర్‌­ఖా­న్‌­పేట కేం­ద్రం­గా 30 వేల ఎక­రా­ల్లో సు­మా­రు 765 చద­ర­పు కి­లో­మీ­ట­ర్ల వి­స్తీ­ర్ణం­లో రూ­పొం­దు­తు­న్న ఈ నెట్-జీరో స్మా­ర్ట్ సిటీ ప్ర­పంచ స్థా­యి ప్ర­మా­ణా­ల­తో రూ­పు­ది­ద్దు­కుం­టోం­ది. ఈ సి­టీ­ని ని­వాస, వా­ణి­జ్య, పరి­శ్ర­మ­లు, వి­నో­దం, గ్రీ­న్ జో­న్లు­గా వి­భ­జిం­చా­రు. ప్ర­తి­ష్టా­త్మక 550 బడా కం­పె­నీ­ల­ను ఇక్క­డి­కి తీ­సు­కు­రా­వ­డ­మే లక్ష్య­మ­ని ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చ­డం, దీ­ని­కి అను­గు­ణం­గా రే­డి­య­ల్ రో­డ్లు, రిం­గ్ రో­డ్ల­కు భూ సే­క­రణ ప్ర­క్రియ చే­ప­ట్టి, పను­ల­కు శం­కు­స్థా­ప­న­లు చే­య­డం­తో ఈ ప్రాంత భూ­ముల కొ­ను­గో­ళ్ల­కు వ్యా­పా­రు­లు, సా­ధా­రణ ప్ర­జ­లు ఆస­క్తి చూ­పు­తు­న్నా­రు. ము­ఖ్యం­గా శం­షా­బా­ద్ అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం నుం­చి ఔటర్ రిం­గు­రో­డ్డు మీ­దు­గా భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సిటీ వరకు 39.6 కి­లో­మీ­ట­ర్ల మేర మె­ట్రో రైలు మా­ర్గా­న్ని ని­ర్మిం­చేం­దు­కు డీ­పీ­ఆ­ర్ సి­ద్ధం చే­య­డం ఈ ప్రాంత అభి­వృ­ద్ధి­కి తి­రు­గు­లే­ని సం­కే­తా­న్ని ఇచ్చిం­ది.

Tags:    

Similar News