INDIA: 2030 నాటికి రూ.3.85 లక్షల కోట్లకు ఎంసీఈ రంగం
భారత్లో గనులు మరియు నిర్మాణ సామగ్రి రంగం భారీ స్థాయిలో అభివృద్ధి;
భారత్లో గనులు మరియు నిర్మాణ సామగ్రి (Mining and Construction Equipment – MCE) రంగం భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.1.36 లక్షల కోట్ల (16 బిలియన్ డాలర్లు) విలువ గల ఈ రంగం, వచ్చే ఐదేళ్లలో వార్షిక 19% వృద్ధిరేటుతో 2030 నాటికి రూ.3.85 లక్షల కోట్లు (45 బిలియన్ డాలర్లు) వరకు చేరనున్నట్లు CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)-కీర్నీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది. ఈ రంగం ఇప్పటికే అమెరికా, జర్మనీ, జపాన్లను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎంసీఈ మార్కెట్గా భారత్ ఎదిగింది. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం – మౌలిక సదుపాయాలు, ఇంధనం, పరిశ్రమల విస్తరణ వంటి రంగాల్లో పెరుగుతున్న అవసరాలు. ప్రభుత్వాలు చేపట్టిన భారీ ప్రాజెక్టులు (భారత్మాలా, గతిశక్తి, నీట్జల్, మేక్ ఇన్ ఇండియా) ఈ రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ ఎంసీఈ మార్కెట్ విలువ 18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ప్రపంచ జీడీపీలో 16% వాటాను కలిగి ఉండగా, భారతదేశంలో ఈ రంగం జీడీపీలో 22% వాటాతో మరింత కీలకంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ రంగం 7 కోట్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నది. రాబోయే ఐదేళ్లలో మరో 2 కోట్ల నూతన ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని అంచనా. భవిష్యత్లో ఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు 100 బిలియన్ డాలర్ల మేర విలువ కలిగించనుందని నివేదిక అంచనా వేస్తోంది. అయితే దీన్ని సాధించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి, స్థానిక తయారీ సామర్థ్యాల పెంపుదల అవసరమని నివేదిక సూచించింది.