NO INTERNET: త్వరలో ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ
లైవ్ టీవీని చూసే మొబైల్స్ను తీసుకొచ్చేందుకు రెండు కంపెనీలు సిద్ధం..!;
టీవీ ప్రసారాలు చూడొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లైవ్ టీవీని చూసే మొబైల్స్ను తీసుకొచ్చేందుకు రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గతంలో నోకియా పేరుతో ఫోన్లు తయారుచేసే హెచ్ఎండీ సంస్థ.. ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, ఇతరులతో కలిసి డైరెక్ట్-టు-మొబైల్(డీ2ఎం) ఫోన్లు మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. లావా ఇంటర్నేషనల్ సైతం డీ2ఎం ఫీచర్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్-2025 ఈవెంట్ వేళ ఈ రెండు కంపెనీలు ప్రకటన చేశాయి.
తేజస్ నెట్వర్క్స్తో భాగస్వామ్యం
డైరెక్ట్-టు-మొబైల్ సేవలను అందించడానికి హెచ్ఎండీ సంస్థ ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సింక్లెయిర్తో కలిసి మొబైల్ ఫోన్ను రూపొందించింది. దీన్ని వేవ్స్ 2025 ఈవెంట్లో ప్రదర్శించనుంది. మే 1 నుంచి నాలుగు రోజుల పాటు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. లావా కూడా ఇన్హౌస్ ఆర్అండ్డీ టీమ్తో పాటు తేజస్ నెట్వర్క్స్తో కలిపి ఫీచర్ ఫోన్ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. మీడియాటెక్ ఎంటీ6261 ప్రాసెసర్, శాంఖ్య రూపొందించిన ఎస్ఎల్3000 చిప్తో ఈ మొబైల్ పనిచేస్తుంది. టీవీ ప్రసారాల కోసం యూహెచ్ఎఫ్ యాంటెన్నా ఉంటుంది. 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫీచర్లో అమర్చారు.