వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. 19 కిలోల గ్యాస్ బండ ధరను రూ.6.5 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు గురువారం ప్రకటించాయి. ఫలితంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,652.50కు చేరింది. గత నాలుగు నెలలు కమర్షియల్ సిలిండర్ ధర తగ్గగా, ఈసారి మాత్రం స్వల్పంగా పెరిగింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2కిలోల గ్యాస్ బండ ధరలో ఈసారి ఎలాంటి మార్పు లేదు.