Apple 17 series launch: ఆపిల్ ఫీవర్.. ముంబై స్టోర్లో ప్రీ-బుకింగ్ కోసం కొట్టుకుంటున్న జనం
భారతదేశంలో సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ కోసం ముంబై ఆపిల్ స్టోర్ లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
ఆపిల్ గురువారం భారతదేశం అంతటా కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలను ప్రారంభించింది. ముంబై స్టోర్ వెలుపల భారీ సంఖ్యలో జనసమూహం, పొడవైన క్యూలు కనిపించాయి.టెక్కీలు తాజా ఐఫోన్ కొనుగోలు చేయడానికి యుద్ధమే చేస్తున్నారు.
ముంబైలోని BKC జియో సెంటర్లోని ఆపిల్ స్టోర్ వెలుపల ఘర్షణ చెలరేగింది. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 9న ఐఫోన్ సిరీస్ లాంచ్లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఎయిర్పాడ్స్ 3, వాచ్ సిరీస్ 11, వాచ్ SE3 మరియు వాచ్ అల్ట్రా 3 ఉన్నాయి.
ఆపిల్ కొత్త ఫోన్ కొనడానికి అహ్మదాబాద్ నుండి ముంబైకి వచ్చిన ఐఫోన్ కొనుగోలుదారులలో ఒకరైన మోహన్ యాదవ్, ఉదయం 5 గంటల నుండి వేచి ఉన్నానని చెప్పాడు. భద్రత లేకపోవడం వల్ల, ప్రజలు తరచుగా క్యూలను కట్ చేస్తారని, దీనివల్ల ప్రవేశ ద్వారం వద్ద గందరగోళం ఏర్పడుతుందని అతను పేర్కొన్నాడు.
ముంబై నివాసి బయాన్ కపూర్ కూడా కొత్త ఐఫోన్ 17 పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ఫోన్ సమీక్షలు బాగున్నాయని పేర్కొన్నాడు. "ప్రజల్లో ఆపిల్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఫోన్ సమీక్షలు బాగున్నాయి. నాకు అవకాశం వస్తే ఇప్పుడే కొనాలనుకుంటున్నాను. పెద్ద జనసమూహం కారణంగా నేను దానిని కొనగలనా లేదా అనేది నాకు తెలియదు" అని బయాన్ కపూర్ అన్నారు.