Fastag : అమలులోకి ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్

Update: 2024-08-01 09:10 GMT

ఫాస్ట్ ట్యాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ టేట్ల వద్ద జాప్యం లేకుండా ఆన్ లైన్లోనే టోల్ ఫీజు చెల్లించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ను వాహన దారులు ఉపయోగిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోలు వసూలు చేస్తున్నారు.

తాజాగా ఫాస్ట్ ట్యాగ్ పై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ పీసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడు నుంచి ఐదు సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్ట్ ట్యాగ్ ల కేవైసీని అక్టోబర్ 31 లోగా పూర్తి చేయాలని ఎస్పీసీఐ కోరింది. ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగిస్తున్న వారు తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల క్రితం జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్ లను తప్ప నిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి వాహనదారుడు తమ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన తేదీని చెక్ చేసుకుని కేవైసీ పూర్తి చేయడంతోపాటు, ఐదు సంవత్సరాలు పూర్తయిన వాటిస్థానంలో కొత్తవాటిని తీసుకో వాల్సి ఉంటుంది. అప్డేడేట్ ను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రతి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉండాలి. కేవైసీ అప్డేట్ కోసం చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వాహనదారులు వీటిని వెంటనే ప్రారంభించాలని కోరింది.

Tags:    

Similar News