UPI Payment Limits : యూపీఐ చెల్లింపుల్లో మార్పులు

Update: 2024-08-09 11:30 GMT

యూపీఐ లావాదేవీల్లో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను వెల్లడించే సమ యంలో ఆర్బీఐ గవర్నర్ యూపీఐ చెల్లింపుల్లో తీసుకు వచ్చిన మార్పులను వెల్లడించారు. యూపీఐ చేసే ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని పెంచుతున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలుగా ఉన్న ఈ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచారు. ఫలితంగా ఆదాయ పన్ను, ఆస్తిపన్ను, మందుస్తు పన్ను చెల్లింపులు చేసే వారు ఒక లావాదేవీలో 5 లక్షల వరకు చెల్లించే అకాశం కలుగుతుంది.

యూపీఐ చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ గతంలోనూ పలు సడలింపులు ఇచ్చింది. 2023 డిసెంబర్లో వైద్య ఖర్లు, విద్యా సంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా 5 లక్షల వరకు చెల్లించే వెసులుబాటు కల్పించింది. అంతకు ముందు క్యాపిటల్ మార్కెట్లు, బీమా, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ల చెల్లింపుల పరిమితిని కూడా 2 లక్షలకు పెంచింది. ఐపీఓల్లో పెట్టుబడి, రిటైల్ డైరెక్స్ స్కీమ్ ల్లోనూ యూపీఐ ద్వారా 5 లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పించింది.

ఇప్పటి వరకు లక్షకు మించి పన్ను చెల్లించాల్సి వచ్చిన వారు క్రెడిట్, డెబిట్ కార్డులను వాడేవారు. లేదంటే బ్యాంకు వెళ్లి చేసేవారు. కార్డుల ద్వారా అయితే సీవీవీ, ఎక్స్ పైరీ తేదీ సహా ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీతో ధ్రవీకరించాలి. కార్డులపై ఉన్న నిబంధనల ప్రకారం కొన్ని రకాల రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. పిన్ నెంబర్ ఎంటర్ చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

Tags:    

Similar News