పల్లవి, బిజినెస్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో మొబైల్ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం05 పేరుతో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్తో దీన్ని ఆవిష్కరించింది. శాంసంగ్ కొత్త ఫోన్ ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్ గ్రీన్ రంగులో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్, అమెజాన్ ప్లాట్ఫామ్తోపాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐతో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉపయోగించారు. డ్యూయల్ నానో సిమ్కు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకొనే సదుపాయం ఉంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. 4జీ, 3.5ఎంఎం హెచ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్కు సపోర్ట్ చేస్తుంది.