Samsung M55s : ఎమ్​ సిరీస్‌లో శాంసంగ్ కొత్త ఫోన్‌

Update: 2024-09-24 08:30 GMT

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. తన ఎమ్​ సిరీస్‌లో ఎం55 ఎస్‌ పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గతంతో ఎం55, ఎఫ్‌ 55 ఫోన్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ.. చిన్న చిన్న మార్పులతో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ ఎం55ఎస్‌ 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ఎస్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది.12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ వరకు మరో రెండు వేరియంట్లు ఉన్నా.. వాటి ధరలను మాత్రం శాంసంగ్‌ వెల్లడించలేదు. అమెజాన్‌, శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లలో సెప్టెంబర్‌ 26న అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులతో కొనుగోల చేస్తే రూ.2 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. కోరల్‌ గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్​ జడ్​ రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ అమర్చారు. ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియోను రికార్డు చేయొచ్చు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45వోల్ట్స్​ ఫాస్ట్‌ చార్జింగ్‌ సదుపాయం, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Tags:    

Similar News