వాహనదారులకు ఝలక్.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుబంటుండడంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.;
దేశంలో నిత్యం మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుబంటుండడంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
హైదరాబాద్లో బుధవారం(17-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.92.84గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.93 గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.29గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 79.70గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.546గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.83.29గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.75గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 86.72 గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.52గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.83గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.28గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 84.49గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.84గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.69గా ఉంది.