VEHICLE: ప్యాసింజర్ వెహికల్ అమ్మకాల్లో మహారాష్ట్ర టాప్
భారత్ లో పెరిగిన ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు;
గత ఆర్థిక సంవత్సరం 2024–25లో భారత్ లో జరిగిన ప్యాసింజర్ వెహికల్ (కార్లు, బస్సులు వంటివి) అమ్మకాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా... టూ-వీలర్ సేల్స్లో ఉత్తర ప్రదేశ్ టాప్లో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రకటించింది. మహారాష్ట్రలో గత ఏడాది 5,06,254 యూనిట్స్ ప్యాసింజర్ వెహికిల్స్ సేల్ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ 4,55,530 యూనిట్స్ సేల్స్ తో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ 3,54,054 యూనిట్స్ అమ్మకాలతో మూడో స్థానంలో... 3,09,464 యూనిట్స్ అమ్మకాలతో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచాయి. కమర్షియల్ వెహికల్ అమ్మకాల్లో మహారాష్ట్ర టాప్లో ఉంది. ఈ రాష్ట్రంలో 2024–25 లో 1,34,044 బండ్లు అమ్ముడయ్యాయి.
ద్విచక్ర వాహన అమ్మకాల్లో..
కిందటి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్లో 28,43,410 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. దేశంలో అత్యధికంగా టూ వీలర్స్ అమ్ముడుపోయిన రాష్ట్రాల్లో యూపీనే అగ్రస్థాంలో ఉంది. మహారాష్ట్ర రెండో స్థానంలో (20,91,250 యూనిట్స్,10.7 శాతం), తమిళనాడు మూడో స్థానంలో (14,81,511 యూనిట్స్, 7.6 శాతం), కర్ణాటక నాల్గో స్థానంలో (12,94,582 యూనిట్స్, 6.6 శాతం), గుజరాత్ ఐదో స్థానంలో (12,90,588 యూనిట్స్, 6.6శాతం) ఉన్నాయి. త్రీ వీలర్ సేల్స్లో యూపీ టాప్లో ఉంది. ఈ రాష్ట్రంలో 93,865 యూనిట్స్ (12.7 శాతం వాటా) సేల్ అయ్యాయి.