పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మోస్టివేటెడ్ మూవీ 'ఓజీ'. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోంది. ఇక ఇటీవలే రిలీజ్ అయిన ప్రమోషన ల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న 'ఓజీ' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నాడు. ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ రికార్డింగ్ వర్క్ స్పీడ్ గా కొనసాగుతుం దని.. లండన్లోని అబ్బీ రోడ్ స్టూడియోస్లో 117 మంది మ్యూజిషియన్స్ తో ఈ రికార్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమా మ్యూజిక్ కోసం థమన్ డెడికేషన్ సూపర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెం ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఈనెల 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.