ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో ప్రేక్షకులకు పరిచయమైన నటి ముంతాజ్ (Mumtaz) అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. తనకు ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి సోకినట్లు చెప్పారు. ఈ వ్యాధితో ఎముకల జాయింట్స్లో భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు. తన అన్నయ్య మద్దతు లేకుంటే ఇప్పటికే ఆత్మహత్య చేసుకునేదాన్నని చెప్పారు. 43 ఏళ్ల తనకు ఇకపై వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను గ్లామరస్గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముంతాజ్ పేర్కొన్నారు. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని అన్నారు. దయచేసి నా ఫ్యాన్స్ నా గ్లామర్ పిక్స్ షేర్ చెయ్యొద్దు. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయకండి అని తెలిపింది. ముంతాజ్ చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించారు.