బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి సురేశ్ మహానటి సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యింది. అంతకు ముందు నేను శైలజ సినిమాలోనూ నటించిందీ భామ. కెరీర్ ఆరంభంలో నుంచి మంచి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోందీ అమ్మడు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్ష కులను కట్టిపడేసింది. అలా టాలీవుడ్తో పాటు కోలివుడ్ లోను వరుస సినిమాలు తీసిన కీర్తి 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడామెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.హిందీలో మరో ప్రాజెక్టు కోసం పలువురు దర్శక నిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు, కొన్ని రోజులుగా నెట్టింట్లో వార్తలు వినపడుతుండగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పై రూపొందుతున్న ఓ చిత్రంలో బాలీవుడ్ కథా నాయకుడు రాజ్ కుమార్ రావుతో కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్టును, రాజ్ తన సొంత నిర్మాణ సంస్థ పై తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం విద్యను ఒక వ్యాపారంలా మార్చే శారు. ఈ వ్యవస్థలోని కుంభకోణాలను బయట పెట్టే విద్యావేత్తగా కనిపించనుంది కీర్తి.