కంఫర్ట్ జోన్ ప్రజలను ఎదగనీయదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు అలవాటైన ప్రదేశం నుంచి బయటకు రండి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు. మీరు ఎదగాలంటే అక్కడి నుంచి బయటపడాలి. కఠినమైన విషయాలు నేర్చుకోవాలి. కొత్తదనాన్ని కోరుకోవాలి. సుఖవంతమైన జీవితం అందరినీ బద్ధకస్థులుగా మారుస్తుంది.’ అంటూ రాసుకొచ్చారు.
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ కి.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరిగా ‘ఇండియన్2’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రజంట్ తన భర్త నిర్మాణంలో బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. దీంతో పాటుగా అజయ్ దేవగన్, మాధవన్ తో కలిసి ‘దే దే ప్రాయ్ దే2’ సినిమాలో నటిస్తోంది.