Aishwarya Dhanush: ఆవేశంతో విడిపోయినా.. ఆలోచించి 'ఐశ్వర్య ధనుష్'..

Aishwarya Dhanush: కొందరిపై కొన్ని అభిప్రాయాలు. కొన్ని జంటలు విడిపోతున్నాయంటే అభిమానులు అది తమ పర్సనల్ ఇష్యూగా తీసుకుని చాలా బాధపడుతుంటారు.

Update: 2022-10-07 06:05 GMT

Aishwarya Dhanush: కొందరిపై కొన్ని అభిప్రాయాలు. కొన్ని జంటలు విడిపోతున్నాయంటే అభిమానులు అది తమ పర్సనల్ ఇష్యూగా తీసుకుని చాలా బాధపడుతుంటారు. ఐశ్వర్య, ధనుష్‌లు విడిపోతున్నారని తెలిసినప్పుడు కూడా అంతే బాధపడ్డారు. సర్ధుకుపోవచ్చుకదా.. విడిపోవడం ఎందుకు అని కామెంట్ పెట్టారు.


ఎదిగిన పిల్లలకు ఎంతో అవసరం మీరు అని సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఇరు కుటుంబాల సభ్యులు కూడా తమ పిల్లలు విడిపోవడాన్ని ఇష్టపడలేదు. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అంత మాత్రం చేత ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు అని నచ్చచెప్పారు. కలిసి ఉండేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు.


వారి ప్రయత్నాలు ఫలిచాయో లేదో, వాళ్లిద్దరూ మళ్లీ కలిసి ఉండాలని రాసి పెట్టి ఉందో.. మొత్తానికి ఐశ్వర్య, ధనుష్‌ విడిపోవడాన్ని విరమించుకోబోతున్నారని తెలుస్తోంది. దీంతో అభిమానుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదిలా ఉంటే, తాజా నివేదికపై ఈ జంట స్పందిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


విడిపోతున్నామని ప్రకటించిన తరువాత ఈ జంట వారి కుమారులు యాత్ర, లింగాతో టచ్‌లో ఉన్నారు. వారితో వ్యక్తిగతంగా గడుపుతున్నారు. తమ కుమారుడు యాత్ర పాఠశాల స్పోర్ట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కలిసి కనిపించారు.


వర్క్ ఫ్రంట్‌లో, ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. డిసెంబర్‌లో 'వాతి' విడుదల కానుంది. తదుపరి ప్రాజెక్ట్ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌తో 'కెప్టెన్ మిల్లర్' షూటింగ్ కోసం తేకాసిలో ఉన్నాడు.

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో త్రిభాష చిత్రం చేయవలసి ఉంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్ వైవాహిక జీవితానికి సంబంధించి తీసుకోనున్న నిర్ణయంపట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News