ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. నాగచైతన్య, సమంత కలిసి నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’ జులై 18న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం సమంత - నాగచైతన్యతో కలిసి ప్రమోట్ చేయనున్నారంటూ వార్తలు బయటకొచ్చాయి. విడిపోయిన ఈ జంట మళ్లీ కలిసి వారు నటించిన చిత్రం రీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ చేయడంపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ వార్తలపై నాగ చైతన్య నుంచి ఎలాంటి స్పందన రాకపోగా.. ఆ వార్తల్లో నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.