కాంతారా విడుదలై ఏడాది.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
రిషబ్ శెట్టి 'కాంతారా' ఏడాది పూర్తి చేసుకున్న శుభసందర్భంలో హోంబాలే ఫిల్మ్లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాయి.;
రిషబ్ శెట్టి 'కాంతారా' ఏడాది పూర్తి చేసుకున్న శుభసందర్భంలో హోంబాలే ఫిల్మ్లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాయి. 'కాంతారా' నేటితో ఒక సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడంతో, మేకర్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వక పోస్ట్ను పంచుకున్నారు.
'కాంతారా ' సృష్టికర్తలకు మరియు అభిమానులకు ఇది గొప్ప సంవత్సరం. ఇది హోంబలే ఫిల్మ్స్ నుండి గ్లోబల్ బ్లాక్బస్టర్. రిషబ్ శెట్టి రచించి, నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను జయించడమే కాకుండా రెండు ఆస్కార్లను గెలుచుకుని భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
చిత్రం విడుదలై ఒక సంవత్సరం పూర్తవుతున్నందున, 'కాంతారా'ని ఎపిక్ బ్లాక్బస్టర్గా మార్చిన ఉత్సాహభరితమైన ప్రేక్షకులకు మేకర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు.
రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రీక్వెల్లో పని లో నిమఘ్నమై ఉన్నారు. ఈ ప్రతిభావంతుడైన కథకుడి నుండి ప్రేక్షకులు మరింత ఆసక్తిని కనబరుస్తూ ప్రీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పైన ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి.