టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏ సినిమా చేసిన ఫ్యాన్స్ కు పిచ్చి క్రేజ్. ప్రభాస్ తో మూవీ చేసేందుకు డైరెక్టర్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగా ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. అయితే భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ కపుల్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంట విలన్ రోల్స్ చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలకు కరీనా క్లారిటీ ఇచ్చేసింది. 'ఇప్పటి వరకూ 'స్పిరిట్' సినిమాకు సంబంధించి ఏ ఒక్కరూ మమ్మల్ని కలవలేదు. మా మధ్య చర్చలు జరిగాయి అన్నది పచ్చి అబద్దం. అయితే సౌత్ సినిమాలో నటించాలని నాకూ బలంగా ఉంది. అయితే.. నాకు తగ్గ పాత్ర రావాలి. ఆ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉండాలి. అలాంటి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తా. అందరూ అనుకుంటున్నట్టు 'స్పిరిట్' ఆఫర్ నా దగ్గరకు వచ్చినా.. పాత్ర నచ్చితేనే చేస్తా. మాకైతే ఎలాంటి సమాచారం లేదు’ అని తేల్చి చెప్పేసింది.