నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ నిన్న గుండెపోటుతో ఇంగ్లాండ్ లో మరణించారు. ఆయనకు 53 సంవత్సరాలు. ఆయన మరణ వార్తను నటుడు రచయిత సుహెల్ సేథ్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. సంజయ్ కపూర్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంజయ్ మృతి ఆయన కుటుంబానికి, సహచరులకు తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సన్నిహితుల సమాచారం మేరకు సంజయ్ కపూర్ గార్డ్స్ పోలో క్లబ్ పోలో ఆడుతున్నప్పుడు ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. ఆట ఆపమని అభ్యర్థిం చి, ఆపై మైదానం నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. సంజయ్ 2003 లో కరి ష్మాను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2005 లో కుమార్తె సమైరా, 2011 లో కుమారుడు కియాన్ లకు తల్లిదండ్రులు అయ్యారు. 2014లో, కరిష్మా, సంజయ్ పరస్పర అంగీకారం ద్వారా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2016 లో వారి కి విడాకులు ఖరారు అయ్యాయి. విడిపో యిన తర్వాత, సంజయ్ ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నాడు.