Karisma Kapoor : నా మాజీ భర్త నన్ను వేలం వేశాడు .. కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు
తన మాజీ భర్త సంజయ్ కపూర్పై (Sanjay Kapur) హీరోయిన్ కరిష్మా కపూర్ (Karisma Kapoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు. కానీ ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని చెప్పాను. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. ఇది తెలిసి ఎదురు తిరిగితే నాపై దాడి చేశాడు. అతడి మదర్ కూడా నన్ను చిత్ర హింసలు పెట్టింది. అతడి వేధింపులు భరించలేకే విడాకులు ఇచ్చాను’ అని ఆమె వివరించారు. సంజయ్ కపూర్తో 13 ఏళ్లు కాపురం చేసిన ఈ భామ.. ఆ తర్వాత విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఇది సంచలనం అయింది.
ప్రేమ ఖైదీ అనే సినిమాతో హీరోయిన్గా కెరీర్ను మొదలు పెట్టింది కరీష్మా కపూర్. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అలా దాదాపు పదేళ్ల పాటు ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులను కరీష్మా సొంతం చేసుకుంది.
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్తో దూసుకుపోతోన్న సమయంలోనే కరీష్మా కపూర్.. అజయ్ దేవగణ్తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పిన ఈ భామ.. అభిషేక్ బచ్చన్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే.. 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను కరీష్మా కపూర్ వివాహం చేసుకుంది.