సినీ ప్రేమికులకు ఎప్పటికప్పుడు భారీ చిత్రాలనేకాక.. వైవిధ్యమైన సినిమాలను కూడా అందిస్తోంది లైకా ప్రొడక్షన్స్. ఓ వైపు స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తూనే యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటంలో ముందుటుంది. తాజాగా లైకా ప్రొడక్షన్ లో కొత్త సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు అధికారిక ప్రకటనన విడుదల అయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది.. 2018 సినిమా దర్శకులు.. జూడ్ ఆంథని జోసెఫ్.
రియల్ కాన్సెప్ట్తో ‘2018’ వంటి ఓ విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018లో కేరళలో వరద బీభత్సాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే ప్రభుత్వానికి, ప్రజలు అండగా నిలవటంతో భయానక పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డారు. ఈ నిజ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆంథని జోసెఫ్ .. మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యాడు.
ఈసారి ఆయనతో లైకా ప్రొడక్షన్స్ చేతులు కలిపింది. ప్రేక్షకులను అంచనాలను మించేలా ఓ మెస్మరైజింగ్ మూవీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని లైకా తెలిపింది.