తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. ఆమె మృతికి కారణం అనారోగ్య సమస్యలే అని తెలుస్తోంది. 32 సంవత్సరాల ప్రయాణంలో పాటలు పాడటమే కాకుండా ఆరు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అలాంటి గొప్ప గాయని అకస్మాత్తుగా కన్నుమూయడంతో.. అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక ఉమా రామనన్ తెలుగులో చివరగా ఓ చిన్నదాన అనే సినిమాలో ఓ పాటను పాడారు. 1977లో ప్రారంభమైన ఈమె ప్రస్థానం చనిపోయే వరకు కొనసాగింది. 1977లో శ్రీ కృష్ణ లీల సినిమా కోసం ఎస్వీ వెంకట్రామన్ స్వరపరిచిన మోహనన్ కన్నన్ మురళి పాటతో ఆమె ప్రయాణం మొదలైంది. ఈమె భర్త పేరు AV రమణన్. వీరికి విఘ్నేష్ రమణన్ అనే కుమారుడు ఉన్నాడు. ఉమా రామనన్ అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇళయరాజాతో కలిసి పాడిన పాటలే ఉమా రామనన్ కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ‘షాడోస్’ సినిమాలోని ఇళయరాజా స్వరపరిచిన ‘పూంకతావే తల్తీరావై…’ పాట సంగీత ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘పన్నీర్ పుష్పనం’ సినిమాలోని ‘అనంతరాగం సనేకుమ్ కాలం..’, ‘ఆహాయ వెన్నిలావే…’ మరియు ‘ఒరు నాదన్ అనేకి తోట’లోని ‘ఉన్నై నినాచెన్…’ లాంటి పాటలు ఆమెను నిలబెట్టాయి. ఇళయరాజాతో కలిసి ఆమె 100కు పైగా పాటలు పాడారు.