Manmadhudu Heroine Re-entry : మన్మథుడు హీరోయిన్ రీఎంట్రీ... ఏ సినిమాతో అంటే ?

Update: 2024-05-10 06:58 GMT

టాలీవుడ్ లో మన్మథుడు అంటే ఠక్కున 'గుర్తొచ్చే హీరో నాగార్జున. అది ఎంత ఫేమసో, ఆయన హీరోగా చేసిన మన్మ థుడు సినిమా కూడా అంతే ఫేమస్. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ కథ, మాటలు కే.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే, అను హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాతో టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది అన్షు సగ్గర్. సినిమాలో మహి పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నా రు.

ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నారు అను.. ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ, ఆ సినిమాతో పరాజయాన్ని చవిచూసింది. ఆతరువాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. చాలా కావాలంగా ఇంగ్లాడ్ లో సెటిల్ అయ్యారు. తాజాగా అన్టు రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సందీప్ కిషన్ హీరోగా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు డైరెక్టర్ త్రినాథరావు అనుకి కథ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ,తనపాత్రలోనిఇంపార్టెన్స్ నచ్చడంతో ఆమె ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక 20 ఏండ్ల తర్వాత అను తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కన్ఫమ్ అనేలా బుజ్ వినిపిస్తోంది. త్వరలో ఆమె ఎంట్రీపై అధికారిక ప్రక టన వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News