సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో సక్సెస్అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తాయని ఆశించింది. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయినా కూడా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లు ఉన్నాయి. వచ్చే నెలలో నిధి నటించిన హరిహర వీర మల్లు సినిమా విడుదల కాబోతుంది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఏఎం రత్నం నిర్మించిన ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఇందులో నిధి అగర్వాల్ పాత్రకు మంచి స్పందన వస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ అమ్మడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటి స్తోంది. అది కూడా ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ రెండు మూవీలపై నిధి బోలెడు ఆశలే పెట్టుకుంది. తాజాగా తన ఫొటోలను షేర్ చేయడం ద్వారా మరోసారి నిధి అగర్వాల్ వైరల్ అవుతోంది. ఇంతటి అందాల నిధికి ఎందుకు ఇన్నాళ్లు సరైన బ్రేక్ పడలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే, మరికొంద రు మాత్రం ఈ ఏడాది ఆమెకు టర్న్ కావడం ఖాయం అంటున్నారు.