ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో షారుక్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. గ్రెవిన్ మ్యూజియం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ను బంగారు నాణెంతో సత్కరించింది. ఈ అరుదైన గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే కావడం విశేషం.
బంగారు నాణేలపై షారుక్ ఖాన్ బొమ్మను ముద్రించారు. దీంతో గ్రెవిన్ మ్యూజియంలో తన పేరిట బంగారు నాణేలు ఉన్న తొలి భారతీయ నటుడిగా షారూఖ్ నిలిచాడు. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు బాద్షా షారూఖ్ కావడం విశేషం.
ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.