సుకుమార్ రైటింగ్స్ ని ఇక పై భార్య తబిత..
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ లెక్క తప్పకుండా మంచి సినిమాలు పక్కాగా రూపొందిస్తారు.;
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ లెక్క తప్పకుండా మంచి సినిమాలు పక్కాగా రూపొందిస్తారు. తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించిన చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన బాధ్యతలు తన భార్య తబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ విషయాలన్నీ తన స్నేహితుడు, మేనెజర్ ప్రసాద్ చూసుకునేవారు. ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు.
దీంతో ఆ బాధ్యతల్ని తబితకు అప్పగించాలని చూస్తున్నారు. సుకుమార్ సూచనలతో తబిత కంపెనీ వ్యవహారాలు చక్కబెడతారు. కాగా, ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప తీస్తున్నారు.
ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న మరో చిత్రం నిఖిల్ తో నిర్మిస్తున్న 18 పేజెస్. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు.