హైదరాబాద్ లోని ఆటోనగర్ లో ఇవాళ భారీగా అల్రాజోలం ట్యాబ్లెట్స్ పట్టుబడ్డాయి. 1లక్ష 80 వేల ట్యాబ్లె ట్స్ ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ చేయగా, పరారీలో మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి మీడియాకు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన్నట్లుగా తెలిపారు. ' 9 లక్షలు విలువైన 1.8 లక్షల ఆల్ఫా జోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం. ఇందులో ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేసాం.. మరొకరు పరారీలో ఉన్నారు.. హైదరాబాద్ ఆటో నగర్ లో ఓ కొరియర్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తుండగా అరెస్ట్ చేశాం.. ఈ మందులు గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు గుర్తించాం..డాక్టర్ల సూచనల మేరకే ఈ ట్యాబ్లెట్స్ వాడాలి.. ఇల్లీగల్ గా ఈ ముఠా సభ్యులు ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ షాపులకి పబ్లిక్ గా అమ్ముతున్నట్టు గుర్తించాము.. ఉత్తరప్రదేశ్ చెందిన అజయ్ త్రిపాఠి పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అని అన్నారు.