శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో మహిళ దారుణ హత్య

మహిళపై ఆత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2021-01-08 11:13 GMT

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఎయిర్ పోర్టు రోడ్డులో దుండగులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఎయిర్ పోర్టులోని మూడవ రోటరీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళపై ఆత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని.. ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగలతబెట్టినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News