రన్నింగ్ లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని సోమవారం కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 18న కూకట్ పల్లికి చెందిన ఓ మహిళ ఆంధ్రప్రదేశ్ లోని సామర్లకోటకు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. బస్సు కండక్టర్ సాయికుమార్ సదరు మహిళ సీట్ లో ఒంటిరిగా ప్రయాణిస్తుందని గుర్తించాడు. వెంటనే ఆ మహిళ వద్దకు చేరుకుని వాటర్ బాటిల్ ఇచ్చి మాటమాట కలిపాడు.
బాధితురాలిని మరో సీటులోకి తీసుకెళ్లి ఆమె నోరును గట్టిగా మూసి రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండటంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బస్టాప్ లో దిగిన బాధిత మహిళ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. ట్రావెల్స్ యజమానికి అనిల్ రెడ్డి పై చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ బదిలీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కూకట్ పల్లి పోలీసులు నిందితుడు సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.