కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది.. భరత్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరిపై తుపాకీతో కాల్పులు జరిపాడు.. కాల్పుల్లో దిలీప్ కుమార్ చెందగా, మస్తాన్కు తీవ్ర గాయాలయ్యాయి.. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన భరత్ యాదవ్.. వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్ తమ్ముడు కావడం చర్చనీయాంశమైంది.. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా మాచారం.. అటు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు భరత్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.